నా కోసం 40 మంది..పవన్ సినిమా డైలాగ్స్..
ఎన్నికలు సమీపిస్తున్న ఈ టైంలో పవన్ కళ్యాణ్ వరుసగా ప్రచార సభలో పాల్గొంటూ చాలా యాక్టివ్ గా ఉన్నారు. ప్రచారంలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన పవన్.. మలికిపురం సెంటర్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంగా ఆయన భీమ్లా నాయక్ సినిమా టైం లో జరిగిన కొన్ని సంఘటనల గురించి మాట్లాడారు. ఆనాడు భీమ్లా నాయక్ సినిమా విడుదల కోసం ఎవరిని బతిమిలాడాలి అని అనుకోలేదని.. అవసరమైతే యూట్యూబ్ లో ఫ్రీగా వదలడానికి సిద్ధపడ్డానని పవన్ చెప్పారు. ఆత్మగౌరవం కోసం ప్రాణాలైనా వదులుతామే కానీ ఎవరి ముందు దేహి అని అనాల్సిన అవసరం తమకు లేదని పవన్ అన్నారు. అంతేకాదు ఇప్పుడు తనకోసం సీమ నుంచి 40 మందిని దించారని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి అన్నిటికీ తెగించే వచ్చినట్లు చెప్పిన పవన్.. 40 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పిఠాపురంలో తన కోసం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన చెప్పిన ఈ మాటలు వైరల్ అయ్యాయి. అయితే ఎలక్షన్స్ దగ్గర పడుతున్న ఈ సమయంలో.. ఎటువంటి ఆధారం లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడడం ప్రజలలో అలజడి రేపుతుంది అని కొందరు భావిస్తున్నారు. ఇది సినిమా కాదు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఉద్రిక్తత రేపే మాటలు మాట్లాడకపోవడం మంచిదని అందరి అభిప్రాయం.