ఇక చెల్లి, అన్న ...అనుబంధాలు ఎక్కడ ఉంటాయి? : బొత్స
విమర్శలు చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంయమనం పాటించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో బొత్స మీడియాతో మాట్లాడుతూ ఆమె ఒక పార్టీలో ఉన్నారని, దాని ప్రకారం మాట్లాడుతున్నారన్నారు. తమపై ఆధారపడే ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆమె ఇటీవల వరకు సీఎం జగన్ చెల్లి, ఇప్పుడు ప్రత్యర్థి పార్టీకి నాయకురాలు. ఇక చెల్లి, అన్న అనుబంధాలు ఎక్కడ ఉంటాయి? అని వ్యాఖ్యానించారు. తలకు పెట్టిన బ్యాండేజీ తీసేయాలంటూ జగన్కు వివేకా కుమార్తె సునీత ఇచ్చిన సలహాపై బొత్స స్పందించారు. బ్యాండేజీ ఉంచాలా, తీసేయాలా అనేది డాక్టర్లు చూసుకుంటారని వ్యాఖ్యానించారు.
Tags :