రోజా కు మార్గదర్శి లో చిట్.. ఇదేమి మాయ జగనన్న..
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైంది. దీంతో ఎన్నికల బరిలో దిగుతున్న నేతలు అందరూ తమ ఆస్తులకు, అప్పులకు సంబంధించిన అఫీడివిటీలను సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి.. నగిరి ఎమ్మెల్యే అయిన రోజా ఆస్తుల వివరాలలో మార్గదర్శి పేరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రోజా సమర్పించిన లెక్కల ప్రకారం ఆమెకు 4.58 కోట్ల చరాస్తులు,6.05 కోట్ల స్ధిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఆరు కారులో ఉన్నాయి అని పేర్కొన్న రోజా ఈసారి వాటి లెక్క 9 కి పెంచింది. ఇక దీన్ని బట్టి ఆమె వృద్ధిరేటు ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్థమవుతుంది. ఈ సంగతి కాసేపు పక్కన పెడితే రోజా ఇచ్చిన ఆస్తి వివరాలలో ఎల్టీ0330వీ ఎంఏ/48 నంబరుతో రూ.39.21 లక్షల విలువైన చిట్ మార్గదర్శి లో ఉన్నట్టు పేర్కొంది. దీనితోపాటు మరో ప్రైవేట్ చిట్ కంపెనీలో రూ.32.90 లక్షల చిట్ ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో వైసీపీ ఫ్రాడ్ కంపెనీ అంటూ గత కొద్ది కాలంగా ధ్వజమెత్తిన మార్గదర్శిలో వైసీపీ ఎమ్మెల్యే ఏ భరోసాతో చెట్లు వేశారు అని అందరూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కొందరు నెటిజన్లు ఈ ఉదాహరణ చూపించి జనాలకే కాదు ఆంధ్రాలో ఎమ్మెల్యేలకు కూడా మార్గదర్శి అంటే ఎంత భరోసానో చూడండి అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.