ASBL NSL Infratech

వైసీపీలో 'మండపేట' టెన్షన్..

వైసీపీలో 'మండపేట' టెన్షన్..

మండపేట వైసీపీకి పెను సమస్యలు తెచ్చిపెడుతోంది. ఆ పార్టీ అభ్యర్థిగా సీనియర్ నేత తోట త్రిమూర్తులను ప్రకటించింది. అయితే శిరోముండనం కేసులో జైలు శిక్ష పడడం.. తోట త్రిమూర్తులు, వైసీపీ పార్టీలకు పెనుసమస్యగా మారింది. కిందికోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించడంతో... ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేసేందుకు వీలవుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాదారణంగా రెండేళ్లకన్నా తక్కువ జైలు శిక్ష పడితే, వారు చట్టసభలకుపోటీ చేయొచ్చు. కానీ త్రిమూర్తులకుపడింది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో.. దీంతో పోటీకి అవకాశం లేనట్లే అంటున్నారు నిపుణులు..పైగా శిక్షపై స్టే లభించకపోతే ఆయన జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ అంశంపై సీఎం జగన్ పార్టీ నేతలతో ఇప్పటికే చర్చించారు.

ఓవైపు నామినేషన్ల గడువు ముగిసే స్థితికి వచ్చింది. మరోవైపు అభ్యర్థిపై కేసు ఉంది. పోనీ అభ్యర్థిని మారిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన సైతం హైకమాండ్ కు వచ్చినట్లుచెబుతున్నాయి వైసీపీ శ్రేణులు. అటు చూస్తే.. వరుసగా హ్యాట్రిక్ విజయాలు నమోదుచేసి, బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు.. ఇటేమో తమ పార్టీకి అభ్యర్థి ఎవరా అన్న మీమాంస వీడకపోవడంతో హైకమాండ్ ను కలవరపరుస్తోంది. మరోసారి పిల్లి సుభాష్ చంద్రబోస్ ను బరిలోకి దించితే ఎలా ఉంటుందని హైకమాండ్ ఆలోచిస్తుందన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి.

ఒక వేళ తోట త్రిమూర్తుల్ని కంటిన్యూ చేయిస్తే దళిత ఓట్లపై ఎఫెక్ట్ పడుతుందని భావిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై టీడీపీ నుంచి విమర్శలు తీవ్రమయ్యాయి. తోటను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు కొన్ని దళిత సంఘాలు కూడా ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల దళితుల ఓట్లనే టార్గెట్ చేశారు. వైసీపీకి చెందిన పలువురు దళిత నేతల్ని పార్టీలో చేర్చుకుని టిక్కెట్లు ఇచ్చారు. వైఎస్ఆర్‌సీపికి దళితులు ప్రధాన మద్దతుదారులుగా ఉన్నారు. గత ఐదేళ్ల కాలంలో జరిగిన అనేక పరిణామాలు దళితుల్ని దూరం చేశాయన్న అభిప్రాయం ఉంది.

ఈ క్రమంలో శిరోముండనం కేసులో దోషి తేలిన వ్యక్తినీ సమర్థిస్తూ టిక్కెట్ ఇస్తే మొదటికే మోసం వస్తుందని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే దళితుడైన తన మాజీ డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకు వైసీపీలో ప్రాధాన్యం లభిస్తోంది. సస్పెండ్ చేసినట్లుగా ప్రకటన చేశారు కానీ.. ఆయన పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రంపచోడవరం, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతలు తీసుకున్నారు. ఆయనకు ప్రాధాన్యంపై ఇప్పటికే దళితుల్లో అసంతృరప్తి ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో తోట త్రిమూర్తుల్ని కూడా ప్రోత్సహిస్తే ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంని చెబుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఒక సారి టిక్కెట్ ప్రకటించిన తర్వాత వెనక్కి తగ్గరని.. అభ్యర్థి మార్చరని.. తోట త్రిమూర్తులు వర్గం నమ్మకంతో ఉంది. శిక్షపై స్టే లభించలేదు కాబట్టి.. ఏం చేస్తారన్నది కీలకంగా మారింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :