భారతీయ యూజర్లకు వాట్సాప్ మరోసారి షాక్
భారతీయ యూజర్లకు వాట్సాప్ మరోసారి షాకిచ్చింది. అశ్లీల సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తి, వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదులు, వినతులను ఆధారంగా లక్షలాది ఖాతాలపై నిషేధం విధించింది. నూతన ఐటీ నిబంధనలను అనుసరించి కేవలం ఆగస్టు నెలలోనే 74.2 లక్షల ఖాతాలను బ్యాన్ చేసినట్లు వాట్సాప్ తాజాగా వెల్లడించింది. జులై నెలతో పోల్చుకుంటే ఈ సంఖ్య దాదాపు 2 లక్షలకు పైగా ఎక్కువ. ఆగస్టులో నిషేధం విధించిన మొత్తం అకౌంట్లలో 35 లక్షలకు పైగా ఖాతాలపై ముందస్తుగానే చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్ తెలిపింది. వీటిపై వినియోగదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, కానీ, ఆయా ఖాతాల డేటాను విశ్లేషించి ముందుగానే నిషేధించినట్లు పేర్కొంది. మరోవైపు సెప్టెంబరు నెలలో 72.28 లక్షల ఖాతాలను నిషేధించగా, అందులో 3.1 లక్షల అకౌంట్లను ముందస్తు చర్యల్లో భాగంగానే నిలిపివేశారు.
Tags :