తిరుమలలో వసంతోత్సవాలు ప్రారంభం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. వసంత రుతువులో శ్రీమలయప్ప స్వామి వారికి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. వేడుకల కోసం సప్తగిరులు తలపించేలా మండపాన్ని తీర్చిదిద్దారు. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి, వసంత మండపంలో వేంచేపు చేశారు. అనంతరం ఆస్థానం, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. సోమవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు స్వామివారిని స్వర్ణ రథంపై తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం వసంతోత్సవం నిర్వహిస్తారు.
Tags :