ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. టెహ్రాన్ డ్రోన్ క్షిపణి సాంకేతికతను పరిమితం చేసే దిశగా ఈ ఆంక్షలు విధించడం గమనార్హం. డ్రోన్లకు ఇంజిన్లు తయారు చేఏ 16 మంది వ్యక్తులను, రెండు సంస్థలు అమెరికా ఆర్థిక శాఖలోని విదేశీ ఆస్తుల నియంత్రణ విభాగం ఆంక్షల పరిధిలోకి తెచ్చింది. బ్రిటన్ కూడా డ్రోన్, బాలిస్టిక్ క్షిపణులు తయారు చేసే సంస్థలు, వ్యక్తులనే లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ చర్యలను కట్టడి చేయడానికి రానున్న రోజుల్లో మరిన్ని ఆంక్షలు విధిస్తాం అని అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెలెన్ పేర్కొన్నారు.
Tags :