అమెరికాలో ప్రమాదం.. ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు తెలంగాణ విద్యార్థులను బలిగొంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన డాక్టర్ స్వాతి, డాక్టర్ నవీన్ దంపతుల కుమారుడు నివేశ్ (20), జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలంలోని శివునిపల్లికి చెందిన స్వర్ణకారుడు పార్శి కమల్కుమార్, పద్మ దంపతుల పెద్ద కుమారుడు గౌతమ్ కుమార్ (19) అమెరికాలోని ఆరిజోనా స్టేట్ విశ్వవిద్యాయంలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు.
ఈ ఇద్దరు విశ్వవిద్యాలయం నుంచి ఇంటికి తమ మిత్రులతో కలిసి కారులో వస్తుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనక సీట్లో కూర్చున్న నివేశ్, గౌతమ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు అక్కడి పోలీసులు మృతుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు.