ASBL NSL Infratech

స్కాట్లాండ్‌ లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

స్కాట్లాండ్‌ లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

స్కాట్లాండ్‌లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జితేంద్రనాథ్‌ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22) స్కాట్లాండ్‌లోని డూండీ యూనివర్సిటీలో మాస్టర్స్‌ చదువుతున్నారు. మరికొందరు భారతీయ స్నేహితులతో కలిసి పెర్త్‌ షైర్‌లోని లిన్‌ ఆఫ్‌ తమ్మెల్‌ కి వెళ్లారు. రెండు నదులు కలిసే ఈ ప్రాంతంలో వీరు ట్రెక్కింగ్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తూ జారి నీటిలో పడి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన ప్రదేశంలో వీరి మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంపై లండన్‌లోని అధికారి స్పందించి, మృతుల కుటుంబాలకు సమాచారం అందించామని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను భారత్‌కు పంపననున్నట్లు పేర్కొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :