ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

2024లో టీడీపీ గెలుపు ఎవరూ ఆపలేరు : రామ్మోహన్ నాయుడు

2024లో టీడీపీ గెలుపు ఎవరూ ఆపలేరు : రామ్మోహన్ నాయుడు

నారా లోకేశ్‌ పాదయాత్ర పూర్తయ్యే సమయానికి వైసీపీ ఖాళీ అవుతుందని తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అన్నారు.  టీడీడీ  41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌ గురించి సీఎం జగన్‌ ఢల్లీి వెళ్లలేదని, బాబాయ్‌ హత్యకేసులో కాళ్ల బేరం కోసం వెళ్లారని ఆరోపించారు.  తెలుగు జాతి పరువును డిల్లీలో తాకట్టు పెట్టేందుకే వెళ్లారని ఎద్దేవా చేశారు. ప్రపంచం గర్వపడేలా తెలుగుజాతిని నిలబెట్టే సత్తా టీడీపీలో ఉందన్నారు. తెలంగాణ గాలిలో, నేలలో తెలుగుదేశం పార్టీ ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలంటే టీడీపీతోనే సాధ్యం అన్నారు. 1983లో ప్రపంచ కప్‌ గెలిచిన భారత క్రికెట్‌ జట్టు దూసుకెళ్లినట్టు తెలుగుదేశం పార్టీ దూసుకెళ్తోంది. హైదరాబాద్‌ మాదిరి అమరావతికి పునాదులు చంద్రబాబుతోనే సాధ్యం. 2024లో టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరు. తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయి.  వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్‌పై నమ్మకం లేదు. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో టీడీపీని అధికారంలోకి తీసుకొస్తాం. రాష్ట్రాన్ని రావణకాష్టం చేసి వైనాట్‌ 175 అంటున్నారు. వైనాట్‌ పులివెందుల అని సవాల్‌ విసిరాం. జీవో 1 తెచ్చి టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం అని హెచ్చరించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :