నేను క్లీన్ చిట్ ... ప్రత్యర్థి ఛార్జిషీట్ : వేమిరెడ్డి
తాను నామినేషన్ వేసింది రాజకీయాలు చేయడానికి కాదని, జిల్లాను అభివృద్ధి చేయడానికని నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కార్యాలయంలో ఆయన ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొదటి నుంచి సేవాభావంతో ప్రజల్లోకి వెళ్లానని తెలిపారు. తాను క్లీన్చిట్ ఉన్న వ్యక్తినని, ప్రత్యర్థి విజయ సాయిరెడ్డి ఛార్జిషీట్ ఉన్న వ్యక్తి అని చెప్పారు. ఎవరికీ ఓటు వేయాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు.
Tags :