త్రివిక్రమ్ కు టార్గెట్ పెట్టిన మహేష్
సర్కారు వారి పాట సినిమా రిలీజై చాలా కాలమవుతున్నా, మహేష్ బాబు నుంచి ఇంకో సినిమా వచ్చింది లేదు. ఈ సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడని అనౌన్స్ చేశారు. ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. అయితే తర్వాత ఆ షెడ్యూల్ షూటింగ్ నచ్చలేదని రీషూట్ చేయాలనుకునే టైమ్కు మహేష్ తల్లి ఇందిరా దేవి చనిపోవడం, ఆ వెంటనే మహేష్ తండ్రి కృష్ణ తండ్రి చనిపోవడంతో మళ్లీ ఇప్పటి వరకు మహేష్ సినిమా జోలికి వెళ్లింది లేదు.
రీసెంట్గా బుట్ట బొమ్మ మూవీ ప్రమోషన్స్ లో ఈ సినిమాని ఆగస్టు 11న రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత వంశీ అనౌన్స్ చేశాడు. ఈ నేపథ్యంలో ఎస్ఎస్ఎంబీ28 సినిమా రిలీజ్ ఈ ఏడాది రావడం ఖాయమని ఫ్యాన్స్ అంతా ఫిక్సైపోయారు.
అయితే షూటింగ్ ఏ స్థితిలో ఉందో ఏంటో కూడా తెలియకుండా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం వెనుక పెద్ద ప్లానే ఉందట. అదేంటంటే ఇప్పటివరకు మహేష్ కారణంగానే ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఇప్పుడు మహేషే ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని త్రివిక్రమ్ తో సహా మిగిలిన వాళ్లనూ కోరినట్లు సమాచారం.
దానికి కారణం ఈ సినిమా పూర్తైన వెంటనే మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేయాల్సి ఉంది. కేఎల్ నారాయణ నిర్మాణంలో మహేష్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు సిక్స్ ప్యాక్ లో కనిపించాలని జక్కన్న కండిషన్ పెట్టడంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి సిక్స్ ప్యాక్ చేయాలని మహేష్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మహేష్ త్రివిక్రమ్ కు, నిర్మాతకు టార్గెట్ పెట్టాడంటున్నారు.