వాట్సప్ లో మరో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పంపిచొచ్చు!
ప్రముఖమెసేజింగ్ యాప్ వాట్సప్ తనప్లాట్ఫామ్ ఆల్-ఇన్-వన్గా రూపుదిద్దేందుకుప్రయత్నిస్తోంది. ఆ దిశగా కొత్తకొత్త ఫీచర్లు జోడిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సదుపాయాన్నితీసుకొచ్చిన ఈయాప్, మరో కొత్తఫీచర్కు సిద్ధమవుతోంది. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ను షేర్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. అంటే ఇక పై నెట్వర్క్తో సంబంధం లేకున్నా మీ డాక్యుమెంట్లను పంపించొచ్చన్నమాట. సాధారణంగా నెట్వర్క్ సదుపాయం లేకున్నా బ్లూటూత్ సాయంతో షేర్ఇట్, నియర్ బైషేర్ వంటి అప్లికేషన్ల ద్వారా ఫొటోలు, సినిమాలు పంపిస్తుంటారు. అచ్చం ఆతరహా సేవల్నే వాట్సప్ అందుబాటులోకి తేనుంది. దీనివల్ల ఎటువంటి ప్రత్యేక యాప్ వినియోగంచాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్లను మరింత వేగంగా సురక్షితంగా పంపేందుకు ఈ ఫీచర్ ఉపయోగపపడనుంది. ఈ ఫీఛర్ ఎనేబుల్ చేసుకోవాలంటే వాట్సప్ సిస్టమ్ ఫైల్, ఫొటోల గ్యాలరీ యాక్సెస్ లాంటి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది.