భారతీయ మహిళ అరుదైన రికార్డు... ప్రపంచంలోనే
ప్రముఖ భారతీయ మహిళా స్కైడైవర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత శీతల్ మహాజన్(41) తన సాహసోపేత చర్యతో అరుదైన రికార్డు సృష్టించారు. సుప్రసిద్ధ ఎవరెస్టు శిఖరం ముందు 21,500 అడుగుల ఎత్తులో ఉన్న హెలికాప్టర్ నుంచి కిందకు దుమికారు. కాలాపత్తర్లోని ఎత్తైన ప్రదేశం ( 17,444 అడుగులు)పై విజయవంతంగా ల్యాండయ్యారు. ప్రపంచంలోనే ఈ తరహా భారీ విన్యాసం చేసిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. ఎత్తైన ప్రదేశాల్లో స్కైడైవింగ్తో ఇప్పటికే పలు రికార్డులను సొంతం చేసుకున్న ఆమె తాజాగా మరో ఘనతనూ సాధించారు. భారీ విన్యాసాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన విషయాన్ని సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ ద్వారా శీతల్ మహాజన్ వెల్లడించారు.
Tags :