అన్నా, వదినల దగ్గర అప్పు తీసుకున్న షర్మిల..
గత కొద్ది కాలంగా దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల.. తన అన్న జగన్ మోహన్ రెడ్డి పై ఎన్నో అభియోగాలు చేస్తూ వచ్చారు .ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఆస్తిక సంబంధించిన తగాదాలు కూడా ఉన్నాయి అన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా షర్మిల జగన్ దగ్గర తీసుకున్న అప్పు గురించి బయటకు వచ్చిన వార్త అందర్నీ షాక్ కి గురిచేస్తుంది. కడప పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేసిన ఏపీసీసీచీఫ్ షర్మిల.. తను నామినేషన్ లో ఆస్తి వివరాలతో పాటు ప్రస్తుతం తనకు ఉన్న అప్పుల గురించి కూడా పేర్కొన్నారు.
దీంతో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. 182 కోట్ల ఆస్తుల లెక్క చూపించిన షర్మిల మొత్తం 82 కోట్ల రూపాయల అప్పు ఉన్నట్టు చూపించారు. అయితే ఇందులో విచిత్రం ఏమిటంటే ఈ అప్పు బయట వారి నుంచి తీసుకున్నది కాదట.
తన అన్న సీఎం జగన్ నుంచి 82 కోట్ల, 58లక్షల,15 వేలను అప్పుగా తీసుకున్న షర్మిల వదిన భారతీ దగ్గర నుంచి 19లక్షల, 56 వేల, 682 రూపాయలను అప్పుగా తీసుకున్నట్టు. మొత్తానికి జగన్ దంపతులు ఆమెకు 82 కోట్ల రూపాయల అప్పు ఇచ్చినట్లు లెక్క తేలింది.. వేలుగులోకి వచ్చిన ఈ సరికొత్త విషయం అన్నా చెల్లెల మధ్య జరుగుతున్న ఆస్తుల వివాదంలో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆస్తిపంచడం లేదు అన్న ఆరోపణ ఎదుర్కొంటున్న జగన్ షర్మిలకు కోట్ల రూపాయల అప్పు ఇవ్వడం ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.