ఎన్నికల ముంగిట వరుస జ్వరాలతో నిరసిస్తున్న జనసేనాని.. మరి ప్రచారం సంగతి ఏమిటో?
ఎన్నికలకి ముందు వారాహి యాత్ర చేపట్టి అధికార పార్టీపై తన మాటలతో దాడి చేసిన జనసేనాని ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో నీరసించి పోతున్నాడు. వారాహి రథాన్ని ఎక్కి.. అధికార పార్టీపై మాటలతూటాలు పేలుస్తూ హడావిడి చేయాల్సిన వ్యక్తి కాస్త వరుస జ్వరాల బారిన పడుతున్నాడు. తరచూ ఇలా అనారోగ్యానికి గురి కావడం వెనుక అసలు రహస్యం ఏమిటి అన్నది పెద్ద ప్రశ్నార్ధకంగా మారింది. కొందరైతే నిజంగా జ్వరం వస్తుందా.. లేక జగన్ ని ఎదురుకోలేక జ్వరం నటిస్తున్నారా అని కూడా విమర్శిస్తున్నారు.
మరోపక్క రాబోయే మూడు వారాల ప్రచారం సంగతేమిటో అర్థం కాక కూటమి నేతలు బెంబేలు పడుతున్నారు. అయితే తాజాగా పవన్ ఆరోగ్యం పై స్పందించిన పార్టీ అతని అనారోగ్యం వెనుక అసలు కారణాన్ని వెల్లడించారు.ఇన్ ఫ్లుయెంజా కారణంగా శ్వాస తీసుకోవటానికి పవన్ ఇబ్బంది ఎదుర్కొంటున్నట్టుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రచార సమయంలో క్రేన్స్ తో పూలదండలు లాంటివి ఏర్పాటు చేయవద్దని అభిమానులకు విన్నవించుకున్నారు. ఇటువంటి అనారోగ్య పరిస్థితుల్లో కూడా పవన్ ప్రచారంలో పాల్గొంటున్నారని వాళ్లు పేర్కొన్నారు.