ఆయన్ను కరుడుగట్టిన నేరస్థుడిలా చూస్తున్నారు : భగవంత్ మాన్ ఆరోపణ
తిహాడ్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను కరుడుగట్టిన నేరస్థుల కంటే దారుణంగా చూస్తున్నారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆరోపించారు. నేరస్థులకు ఇచ్చే కనీస సదుపాయాలు కూడా కేజ్రీవాల్కు కల్పించడం లేదన్నారు. జైల్లో ఉన్న కేజ్రీవాల్తో ఆప్ ఎంపీ సందీప్పాఠక్తో కలిసి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ములాఖత్ అయ్యారు. అనంతరం భగవంతఖ మాపఖ మీడియాతో మాట్లాడుతూ అరగంట పాటు ఉన్నప్పటికీ కేవలం ఫోన్లోనే మాట్లాడాల్సి వచ్చిందన్నారు. కేజ్రీవాల్ను చూడగానే భావోద్వేగానికి గురయ్యా. ఆయన్ను కరుడుగట్టిన నేరస్థుడిలా చూస్తున్నారు. ఆయన చేసిన తప్పేంటి? మొహల్లా క్లినిక్ నిర్మించడమే ఆయన తప్పా? అని వాపోయారు.
Tags :