ఆకట్టుకుంటున్న ప్రతినిధి2 ట్రైలర్
భిన్న కథలను సెలెక్ట్ చేసుకునే నారా రోహిత్ ఈసారి ప్రతినిధి2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఏప్రిల్ 25న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూనే ఉంది. టీవీ5 మూర్తి దర్శకత్వంలో వస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ మీద అందరికీ మంచి అంచనాలే ఉన్నాయి.
దానికి తోడు గత రెండు నెలల్లో వచ్చిన పొలిటికల్ మూవీలకు భిన్నంగా ఇందులో సీరియస్ కంటెంట్ ఉంది. ఆవేశం కంటే ఆలోచన ఎక్కువగా ఉంటే జర్నలిస్ట్ తప్పు చేసిన వారెవరైనా సరే వారిని తప్పని ఎత్తిచూపించే రకం. అధికార పార్టీ నాయకుడిని అప్పులతో పాటూ మీ ఆస్తులెలా పెరిగాయని అడిగేంత ధైర్యం ఉన్న వ్యక్తి. అతని పనుల వల్ల రాష్ట్రంలో అలజడి రేగుతుంది.
అయితే ఆ జర్నలిస్ట్ ఆషామాషీ వ్యక్తి కాదని గుర్తించిన ఓ అధికారి ఇన్విస్టిగేషన్ మొదలుపెడతాడు. ఇంతకీ ఈ సినిమా లక్ష్యం ఏంటనేది మాత్రం తెరమీదే చూడాలి. సమాజంలోని రాజకీయ కుళ్లును ప్రతినిధి2లో గట్టిగానే చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ మూర్తి. స్పెషల్ గా ఒకరిని టార్గెట్ చేసినట్లు కాకుండా చూపించడం కూడా బాగుంది. మొత్తానికి ట్రైలర్ చూశాక ప్రతినిధి2 పై అందరికీ ఆశలు పెరిగాయి.