ప్రభాస్-మారుతి సినిమా ఆగిపోయిన మాట రూమరే..!
ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. హర్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియన్ లెవల్లో తెరకెక్కుతుంది.
ఈ మూవీలో ప్రభాస్కి జోడీగా సౌత్ ఇండియన్ హాట్ బ్యూటీస్ నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ నటిస్తున్నారు. మరో కీ రోల్లో రిద్ది కుమార్ కూడా యాక్ట్ చేస్తోంది. ఈ సినిమా కాన్సెప్ట్ ప్రకారం ఓ పురాతన భవనంలో స్టోరీ మొత్తం జరుగుతుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం మారుతి స్పెషల్ గా ఓ భారీ ఇంటిసెట్ను కూడా నిర్మించారు.
ఈ సెట్లో ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయింది. అయితే రీసెంట్ గా ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ రూమర్ ఒకటి ఇప్పుడు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. మారుతి, ప్రభాస్ కాంబోలో వస్తున్న ఈ సినిమా పూర్తిగా ఆగిపోయిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ డేట్స్ అడ్జస్ట్ చేయలేక సినిమాను పక్కన పెట్టాడని, ఈ టాక్ తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంటే ఈ రూమర్స్ లో ఎలాంటి నిజమూ లేదని తెలుస్తోంది. డార్లింగ్ ఈ మూవీ కోసం ఆల్రెడీ ప్రత్యేకంగా డేట్లు అడ్జస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
సలార్, ప్రాజెక్ట్ కె, మారుతి సినిమాల కోసం తన డేట్స్ ను ప్రభాస్ ఎంతో చక్కగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవబోతుందని సమాచారం. ఈ ఏడాదిలోనే సినిమాను కంప్లీట్ చేసి రిలీజ్ చేసేందుకు మారుతి ప్లాన్ చేసినట్లు టాక్. అంతే కాదు సినిమా ఆగిపోయిందని వస్తున్న వార్తలపై ఇప్పటికే నిర్మాత కూడా తన సన్నిహితులకు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.