బీజేపీ విజయంపై అమెరికన్ సింగర్.. ప్రశంసలు
మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయం దక్కింది. మధ్యప్రదేశ్లో మళ్లీ కమలం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోగా రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ను గద్దె దించి అధికార పీఠం ఎక్కింది. ఈ నేపథ్యంలో బీజేపీ విజయంపై ప్రముఖ అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ స్పదించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కొనియాడుతూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. మూడు రాష్ట్రాల్లో కాషాయ పార్టీ అధికారం సాధించడంపై మిల్బెన్ ఆనందం వ్యక్తం చేశారు. నేడు బీజేపీ మూడు రాష్ట్రాల్లో తిరుగులేని విజయం సాధించింది. ఇది ప్రధాని మోదీకి ప్రజలు ఇచ్చిన గొప్ప విజయం. అమెరికా`భారత్ సంబంధాలను మరింత మెరుగుపరచగల ఉత్తమ నాయకుడు అంటూ ప్రశంసించారు.
Tags :