నామినేషన్ కు తరలిన జనసేనాని..
జనసేన అధిపతి పవన్ కళ్యాణ్.. మరి కాసేపట్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా తన నామినేషన్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించబోతున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా పవన్ తన నామినేషన్ని ఈ రోజే ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో చేబ్రోలు లోని పవన్ నివాసం నుంచి బయలుదేరిన ర్యాలీ..పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు సాగుతుంది. అక్కడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాన్వాయ్ లో మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొని పవన్ తన నామినేషన్ను సమర్పిస్తారు. ఈ ర్యాలీలో పాల్గొనడం కోసం భారీ సంఖ్యలో జనసేన, టీడీపీ, బీజేపీకి చెందిన నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ ఈసాలి పిఠాపురం నుంచి గెలవాలి అని ఆకాంక్షిస్తూ ఎందరో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈరోజు ఆయనకి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.
Tags :