అమెరికాకు హెచ్చరిక... అలా చేస్తే ధ్వంసం చేస్తాం
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ అమెరికాకు హెచ్చరికలు పంపారు. తమ జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. ఇటీవల ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. ఈ మేరకు కొరియా రక్షణ శాఖ స్పందించింది. మా అంతరిక్ష ఆస్తులపై వాషింగ్టన్ దాడులకు ప్రయత్నిస్తే మేం ఆ దేశ నిఘా శాటిలైట్లను ధ్వసం చేస్తాం. అలాంటి చర్యలను యుద్ధ ప్రకటనగా భావిస్తాం అని అమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరికలు చేసింది. నిఘా ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు కిమ్ ప్రభుత్వం గతంలో రెండుసార్లు విఫలయత్నాలు చేసింది. అయితే ఈ నెల ప్రారంభంలో రష్యా సహకారంతో శాటిలైట్ ప్రయోగాన్ని విజయవంతం చేసింది. గతవారం ఈ ప్రయోగం జరగ్గా కిమ్ లాంచింగ్ను వీక్షించారు. ఈ ప్రయోగంతో దక్షిణ కొరియా, జపాన్, అమెరికా దేశాలు తమ సైన్యాన్ని అప్రమత్తం చేశాయి.
Tags :