రజినీ సినిమాలో నాగ్?
లియో సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ చేయబోతున్న సినిమాపై అందరూ అమితాసక్తితో ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఈ క్రేజీ డైరెక్టర్ తన సినిమాను చేయబోతున్నాడు. ఈ సినిమా తాలూకు అప్డేట్స్ ఫ్యాన్స్ కు ఓ రేంజ్ లో కిక్కిస్తున్నాయి. హీరోయిజం కు గూస్ బంప్స్ తేవడంలో కొత్త డెఫినేషన్లు రాస్తున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ చేతిలో రజినీ ఏ రేంజ్ లో కనిపిస్తాడో అని ఫ్యాన్స్ నెక్ట్స్ లెవెల్ లో అంచనాలు పెట్టుకుంటున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను ఈ వారంలోనే రివీల్ చేయబోతున్న విషయం తెలిసిందే. 80ల్లో దేశాన్ని ఊపేసిన బంగారం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ ను తీసుకున్న లోకేష్ ఈ సారి రజినీ పాత్రను ఇప్పటివరకు ఎవరూ చూపించని విధంగా ప్రెజెంట్ చేయబోతున్నాడట. ఈ విషయం తెలిసిన రజినీ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ప్రస్తుతం ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వినిపిస్తోంది. రజినీ- లోకేష్ కాంబోలో రూపొందనున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం టాలీవుడ్ కింగ్ నాగార్జునను సంప్రదించినట్లు తెలిసింది. ప్రాథమికంగా జరిగిన డిస్కషన్స్ లో నాగ్ పాజిటివ్ గా స్పందించాడట. ఇప్పటికే శేఖర్ కమ్మలు దర్శకత్వంలో ధనుష్ తో కలిసి నటిస్తున్న నాగ్, ఇప్పుడు రజినీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడని వార్తలొస్తున్నాయి. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ సోర్స్ మాత్రం గట్టిగానే వినిపిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనుందని టాక్.