ఎన్నారైల కృషి అభినందనీయం : నాగబాబు
జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తీసుకురావాలనే తపనతో పని చేస్తున్న గల్ఫ్ దేశాల ఎన్నారై కార్యకర్తల కృషి అభినందనీయమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. దుబాయ్ పర్యటనలో అజ్మాన్ నగరంలోని మైత్రీ ఫాంలో నిర్వహించిన గల్ఫ్ దేశాల ఎన్నారై జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎన్నారై కార్యకర్తల అంకితభావం అమూల్యమని పేర్కొన్నారు. వీరిలో పార్టీలో గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించాలన్న పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచన మేరకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఆస్ట్రేలియా ఎన్నారై జనసైనికులు, వీర మహిళల సమన్వయకర్త కొలికొండ శశిధర్ తదితరులు మాట్లాడారు. దుబాయ్లోని కొత్తగా ఏర్పాటు చేసిన దుబాయ్`యూఏఈ జనసేన పార్టీ కార్యాలయాన్ని నాగబాబు ప్రారంభించారు. కార్యాలయంలో గల్ఫ్ జనసేన పేరుతో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.
Tags :