ASBL NSL Infratech

కేంద్రం సంచలన నిర్ణయం.. ఎర్రచందనంపై

కేంద్రం సంచలన నిర్ణయం.. ఎర్రచందనంపై

ఎర్రచందనంపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎర్రచందనం సాగును సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష నుంచి తొలగించినట్లు కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ప్రకటించారు. ఇక నుంచి రైతులు ఎర్రచందనం సాగు చేసి, ఎగుమతి చేసుకోవచ్చని, ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని తెలిపారు. ఇది రైతులకు ఎంతో మేలు చేసే నిర్ణయం అని చెప్పారు. కాగా దేశంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాత్రమే ఈ అరుదైన ఎర్రచందనం పండుతుంది. అందులోనూ నంద్యాల జిల్లాలోని నల్లమల, లంకమల అడవుల్లోనూ, వైఎస్‌ఆర్‌ కడప, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు జిల్లాల పరిధిలో విస్తరించిన శేషాచల అడువుల్లోనూ ఎర్రచందనం విస్తారంగా పెరుగుతుంది. ఎర్రచందనం సాగుపై ఆంక్షలు ఎత్తివేయటం ద్వారా రైతులు తమ పొలాల్లో ఎర్రచందనం విరివిగా సాగు చేసే అవకాశాలు ఉన్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :