లోకేష్ దూకుడు.. టీడీపీ కి మంచిదేనా..?
గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో యువతులు అదృశ్యమయ్యారు అని నారా లోకేష్ అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదృశ్యమైన యువతులకు సంబంధించిన ఆచూకీ కనుక్కొని వారి కుటుంబ సభ్యులకు ఎలాగైనా అప్పగించడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు విపక్ష పార్టీ నేతలపై, కార్యకర్తల పై తప్పుడు కేసులు పెట్టి వేధించిన అధికారులను ఊరికే విడిచిపెట్టమని.. న్యాయ విచారణ జరిపించి తప్పు చేసిన వారికి తగిన శిక్ష పడేలా చేస్తామని లోకేష్ పేర్కొన్నారు. అంతేకాదు ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం కూడా ఉంది అంటూ వార్నింగ్ ఇచ్చారు. లోకేష్ ఇలా మాట్లాడడం పై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు అతను చెప్పింది కరెక్టే అంతవరకు అందరూ మాత్రం అధికారంలోకి రాకముందే ఇలా మాట్లాడితే తీరా వచ్చాక ఎటువంటి పనులు చేస్తారు అన్నట్లుగా కామెంట్లు పెడుతున్నారు. న్యాయం చేసే వరకు బాగుంది కానీ శిక్షల గురించి మాట్లాడకపోవడమే మంచిది అని కొందరు హితవు పలుకుతున్నారు.