కవిత కోసం బీజేపీ తో కెసిఆర్ కుమ్మక్కవుతున్నారు..
లిక్కర్ స్కామ్ కేసులో జైలు పాలైన తన బిడ్డ కవిత బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇందులో భాగంగా జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ఐదు స్థానాలలో బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ సహకరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ని నమ్మి బీఆర్ఎస్కు ఓటు వేసి ఓటర్లు తమ అమూల్యమైన ఓటు వృధా చేసుకోకూడదు అని పిలుపునిచ్చారు.
మల్కాజ్గిరి జనజాతర సభలో మాట్లాడుతూ.. తాను కష్టాల్లో ఉన్నప్పుడు మల్కాజ్గిరి తనకు అండగా నిలబడింది అని అన్నారు. ఈరోజు తాను ముఖ్యమంత్రి అయ్యాడు అంటే ఈ ప్రజల అండదండలే కారణమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కూడా తమ పార్టీకి ప్రజలు మద్దతు తెలిపి ఓట్లు వేసి గెలిపించాలని కోరుకున్నారు.
Tags :