ASBL NSL Infratech

నాపై ఇలాంటి ఆరోపణలు సిగ్గుచేటు : కంగనా రనౌత్

నాపై ఇలాంటి ఆరోపణలు సిగ్గుచేటు : కంగనా రనౌత్

బాలీవుడ్ నటి, మండి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ బీఫ్ తిన్నారంటూ ఈ మధ్య ఓ కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తనపై వస్తున్న ఈ తరహా ఆరోపణలను కంగనా రనౌత్ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో పోటీ చేస్తుండడం వల్లే తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయని, ఈ వ్యాఖ్యలు నిజంగా సిగ్గుచేటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ ఇటీవల కంగనా రనౌత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బీఫ్‌ తిన్నట్లు గతంలో కంగన స్వయంగా వెల్లడించారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనిపై తాజాగా ఇన్‌స్టాలో స్పందించిన కంగన.. ‘‘నేను బీఫ్, రెడ్ మీట్ ఏదీ తినను. కొన్ని దశాబ్దాలుగా నేను యోగా, ఆయుర్వేద జీవన శైలిని అనుసరిస్తున్నాను. ప్రచారం చేస్తున్నాను. నాపై వస్తున్న వదంతులు పూర్తిగా నిరాధారమైనవి. ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయడం నిజంగా సిగ్గుచేటు. నా పరువుకు భంగం కలిగించేందుకు చేస్తున్న ఇలాంటి కుట్రలు ఏ మాత్రం పనిచేయవు. ప్రజలకు నా గురించి తెలుసు. ఇలాంటి ఆరోపణలతో వారిని తప్పుదోవ పట్టించలేరు’’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే కంగనా రనౌత్ గత నెల బీజేపీలో చేరారు. అనంతరం బీజేపీ అధిష్ఠానం ఆమెను హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దింపింది. టికెట్ దక్కినప్పటి నుంచి ఆమె ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. విపక్షనేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :