అమెరికాలో ఖలిస్థాన్ మద్దతుదారుల వీరంగం
అమెరికాలో ఖలిస్థాన్ మద్దతుదారులు వీరంగం సృష్టించారు. భారత రాయబార కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహిస్తూ హింసను ప్రేరేపించే ప్రసంగాలు చేశారు. భారత రాయబారి తరుణ్జీత్సింగ్ సంధాను అసభ్యకరపదజాలంతో దూషించారు. రాయబార కార్యాలయ ప్రాంగణంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. భారత్కు చెందిన పీటీఐ పాత్రికేయుడు లలిత్ కుమార్ పైనా ఆందోళన కారులు భౌతికంగా దాడికి దిగారు. ఆ సమయంలో అమెరికా సీక్రెట్ సర్వీసు అధికారులు జోక్యం చేసుకొని ఆందోళనకారులను వెనక్కి నెట్టారు.
Tags :