కాప్-28 డిక్లరేషన్ పై సంతకం చేయని భారత్.. అమెరికా కూడా
ఆరోగ్యం, వాతావరణంపై కాప్-28 రూపొందించిన డిక్లరేషన్పై భారత్ సంతకం చేయలేదు. ఆరోగ్యరంగంలో శీతలీకరణకు వినియోగించే గ్రీన్హౌస్ ఉద్గారాలను తగ్గించాలని ఈ డిక్లరేషన్ చెబుతోంది. ఇందులోని నిబంధనలు అమలు చేస్తే దేశ ఆరోగ్యరంగం ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అందుకే దీనికి దూరంగా ఉండాలని భారత్ భావిస్తోంది. ఈ డాక్యుమెంటుపై 124 దేశాలు సంతకాలు చేశాయి. అత్యధిక స్థాయిలో గ్రీన్ హౌస్ ఉద్గారాలను విడుదల చేసే అమెరికా కూడా సంతకం చేయకపోవడం గమనార్హం. కాప్-28 సదస్సుల్లో నాలుగో రోజైన ఫెయిత్ పెవిలియన్ ప్రారంభోత్సవం జరిగింది. ఇందులో వివిధ మతాలకు చెందిన నేతలు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
Tags :