బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్ లోకి మాజీ కేంద్ర మంత్రి
లోక్సభ ఎన్నికల ముందు బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్ బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. తన కుమారుడు బ్రిజేందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీ చేరిన దాదాపు నెల రోజుల తర్వాత బీరేందర్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనతో పాటు భార్య, హర్యానా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ లత కూడా బీజేపీని వీడారు. ఢిల్లీలో బీరేందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ నేను బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. నా రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపాను. 2014-2019 వరకు ఎమ్మెల్యేగా కొనసాగిన నా భార్య ప్రేమ్ లత కూడా రాజీనామా చేశారు. రేపు, మేం కాంగ్రెస్లో చేరనున్నాం అని అన్నారు.
Tags :