అమెరికన్ బిలియనీర్ కు ఈడీ సమన్లు
భారత్కు చెందిన ఆన్లైన్ వార్తల పోర్టల్ న్యూస్ క్లిక్ కేసులో అమెరికా బిలియనీర్ నెవిల్లే రాయ్ సింగంకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తాజా సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ చట్టం కింద భారత విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా చైనాలోని షాంఘైలో ఉన్న నెవిల్లే రాయ్ సింగంకు నోటీసులు పంపింది. ఆయన వాదనలు రికార్డు చేసేందుకు ఢిల్లీ కోర్టు అనుమతించిన నేపథ్యంలో ఈడీ రెండోసారి ఆయన ఈ మెయిల్, చైనా ప్రభుత్వ వర్గాల ద్వారా సమన్లు జారీ చేసింది. న్యూస్ క్లిక్ వివాదంలో తనపై వచ్చిన ఆరోపణలను నెవిల్లే ఇప్పటికే ఖండించారు.
Tags :