జూలై 22న బే ఏరియాలో దేవిశ్రీ సంగీత విభావరి
బేఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా), పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీత విభావరిని జూలై 22వ తేదీన ఏర్పాటు చేశారు. శాన్హోసె సివిక్ సెంటర్లో లైవ్ ఇన్ బే ఏరియా పేరుతో ఏర్పాటు చేసిన ఈ సంగీత విభావరికి అందరూ వచ్చి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. అనసూయ భరద్వాజ్ ఈ కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఇతర వివరాలకు ఫ్లయర్ను చూడండి.
Tags :