అవినాష్ అరెస్ట్ కన్ఫామ్.. సీఎం రమేశ్
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు రోజుకు రకంగా మారుతున్నాయి. ఒకరినొకరు వ్యాఖ్యానించుకునే దగ్గరనుంచి నిందలు వేసుకునే వరకు అభ్యర్థులు ఎక్కడ ఛాన్స్ వదలడం లేదు. అనకాపల్లి లోక్ సభ బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవినాష్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ చేస్తున్న తప్పులు మొత్తం కేంద్రంలో ఉన్నవారికి తెలిసే జరుగుతున్నాయి అని వారు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. తాము చేస్తున్న తప్పులను అనవసరంగా బీజేపీకి ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం నుంచి జగన్ కు ఎటువంటి మద్దతు రాదని.. ఏడాది క్రితం తిరుపతిలో జేపీ నడ్డా.. వైజాగ్ లో అమిత్ షా జగన్ గురించి చేసిన వ్యాఖ్యలే వీటికి నిదర్శనమని ఆయన అన్నారు. అంతేకాదు గతంలో అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి సిబిఐ రాష్ట్రానికి వచ్చినప్పుడు.. రాయలసీమలోని ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను తెచ్చి.. హాస్పిటల్ వద్ద గొడవ చేసి అరెస్టును ఆపారని ఆయన ఆరోపించారు. అయితే ఎప్పటికైనా అవినాష్ రెడ్డి అనే వ్యక్తి కచ్చితంగా అరెస్టు అవుతాడని జోష్యం చెప్పారు. అయితే మరోపక్క జగన్ కు పెరిగిపోతున్న పాపులారిటీ తట్టుకోలేక అతనిపై ఇలా నిందలు వేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.