ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కేంద్ర కీలక నిర్ణయం... సీఈసీ రాజీవ్ కుమార్ కు జెడ్ కేటగిరి

కేంద్ర కీలక నిర్ణయం...  సీఈసీ రాజీవ్ కుమార్ కు జెడ్ కేటగిరి

లోక్‌సభ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు జెడ్‌ కేటగిరి కింద వీఐపీ భద్రత కల్పించింది. దీంతో సాయుధ కమాండో దళాలు ఆయనకు పూర్తి రక్షణ కల్పించనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా ఆయనకు పూర్తి రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి భద్రతా ఏజెన్సీలు ఇటీవల సిఫార్సు చేశాయి. దీనిని పరిశీలించిన హోంశాఖ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌కు చెందిన 40 నుంచి 45 మంది సిబ్బంది సీఈసీ రక్షణ విధుల్లో ఉండనున్నారు.  1984 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ రాజీవ్‌ కుమార్‌ 2020లో ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. మే 15, 2022న 25న ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం 18వ లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో నిమగ్నమయ్యారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :