ఆ రెండు రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం.. పోలింగ్ కు సిద్ధం
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. చివరి రోజున అధికార, విపక్షాలు ముమ్మరం ప్రచారం చేశాయి. 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్లో నవంబర్ 17న ఒకేరోజు పోలింగ్ జరగనుంది. అదే రోజు ఛత్తీస్గఢ్లో రెండో విడతలో భాగంగా 70 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మధ్యప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్, సమాజ్వాదీ, బీఎస్పీతో పాటు కమ్యూనిస్టు పార్టీలు బరిలో ఉన్నప్పటికీ బీజేపీ` కాంగ్రెస్ మధ్యే కీలక పోరు కొనసాగనుంది. ఛత్తీస్గఢ్లోనూ ఈ రెండు పార్టీల మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. మధ్యప్రదేశ్లో నవంబర్ 17 ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు గాను 5.6 కోట్ల ఓటర్లు పాల్గొననున్నారు.
Tags :