న్యూజెర్సీలో బోనాల జాతర సందడి...
తెలంగాణ సంస్కృతీకి ప్రతీక అయిన బోనాల జాతర సంబురాలు ఖండాంతరాలు దాటింది. తెలంగాణ సంస్కృతీ, ఆచార సంప్రదాయాలకు అద్దంపట్టే పండుగ బోనాల జాతరను అగ్రరాజ్యం అమెరికాలోనూ ప్రవాసీయులు మొట్టమొదటిసారిగా ఘనంగా నిర్వహించుకున్నారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (మాట), సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం సంయుక్తంగా బోనాల జాతరను నిర్వహించాయి. హైదరాబాద్ లాల్ దర్వాజ లష్కర్ బోనాలను మరిపించే విధంగా, న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్లో పోతురాజు నృత్యాలతో అట్టహాసంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు ప్రవాసులు భారీ సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఎడిసన్ ప్రాంతంలోని తెలుగు ఆడపడుచులు బోనమెత్తారు. అమ్మ వారిని మేళతాళలతో ఘనంగా స్వాగతించి, పూజలు సమర్పించి, తెలంగాణ - అమెరికా ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించారు. సాయిదత్తాపీఠం చైర్మెన్ రఘుశర్మ శంకరమంచి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట అధ్యక్షులు శ్రీనివాస గనగోని అందరికి బోనాల శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో తొలిసారిగా బోనాలు చేయడం, ఘనంగా నిర్వహించుకోవడం సంతృప్తిని కలిగించిందన్నారు. మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు చేయబోతున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కిరణ్ దుద్దగి, విజయ్ భాస్కర్ కలాల్, శ్రీధర్ గుడాల, దాము గేదెల (గౌరవనీయ సలహాదారు), జైదీప్ రెడ్డి (గౌరవ సలహాదారు), కృష్ణశ్రీ గంధం, మహేందర్ నరలా, వెంకీ మస్తీ, కృష్ణ సిద్ధదా, రంగారావు మాడిశెట్టి, గిరిజా మాదాసి, మహిపాల్ రెడ్డి, రాకేష్ కస్తూరి, ప్రభాకర్, పూర్ణ, శేషగిరిరావు, శిరీషా గుండపనేని, రఘు మడుపోజు, దీపక్ కట్టా, సురేష్ ఖజానా, అశోక్ చింతకుంట, మాధవి సోలేటి తదితరులు పాల్గొన్నారు.