రావాలని టీఆర్ఎస్.. రాకూడదని కాంగ్రెస్ పార్టీ
ఉప ఎన్నిక రావాలని టీఆర్ఎస్, రాకూడదని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలో హైకమాండ్ నిర్ణయిస్తుందని తెలిపారు. ఉప ఎన్నికపై ప్రజల అభిప్రాయానికే బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 15 అసెంబ్లీ స్థానాలకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. క్యాసినో సహా అన్ని దందాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారని ఆరోపించారు.
కాళేశ్వరం లోపాలపై త్వరలో వివేక్ ఆధ్వర్యంలో ఢిల్లీ కి బృందం వెళ్తుందని తెలిపారు. కాళేశ్వరం అవినీతిపై కేంద్ర జలశక్తి మంత్రికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ప్రజలు వరదలతో ఇబ్బందుల్లో ఉంటే, సీఎం కేసీఆర్ విహారయాత్రలా? అని ప్రశ్నించారు. పాతబస్తీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టి పెట్టారని పేర్కొన్నారు.
Tags :