అయోధ్యకు భక్తులూ రావొద్దు!
ఈ నెల 17న శ్రీరామ నవమి వేడుకలకు జరుగనున్నాయి. రామయ్య జన్మదినోత్సవ వేడుకలు అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చే అకాశం ఉండడంతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భక్తులకు కీలక విజ్ఞప్తి చేసింది. శ్రీరామనవమికి అయోధ్యకు రాకుండా ఇంటి వద్దనే ఉండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వేడుకలను వీక్షించాలని కోరింది. ఈ మేరకు రామ నవిమి నాడు అయోధ్యలో జరిగే పూజ హారతి కార్యక్రమాలన్నీ ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్లో బాల రాముడిని దర్శించుకోవాలని ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. ఉత్సవాల తర్వాత రద్దీ తగ్గుతుందని, ఆ తర్వాత బాలా రామచంద్రస్వామిని దర్శించుకోవాలని తెలిపింది.
Tags :