ప్రధానికి వంద కోట్లు ఇచ్చినట్లు చెబితే ... ఆయన్ను అరెస్టు చేస్తారా?
కేంద్ర దర్యాప్తు సంస్థలు కోర్టుకు అబద్దాలు చెబుతున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. లిక్కర్ స్కామ్లో ఆయనకు సీబీఐ సమన్లు జారీచేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దర్యాప్తు సంస్థలు అబద్దాలు చెప్పి, ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు వెల్లడించారు. సీబీఐ నుంచి తనకు సమన్లు అందినట్లు తెలిపారు. ఆ సమన్లు గౌరవిస్తున్నట్లు కూడా చెప్పారు. ప్రధానికి వంద కోట్లు ఇచ్చినట్లు నేను చెబితే, అప్పుడు ప్రధానిని అరెస్టు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు.
Tags :