ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. హైకోర్టు ఆదేశం
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 టీడీపీ సానుభూతి కుటుంబాలను 2019లో రాజకీయ కక్షలతో వైసీపీ నేతలు గ్రామ బహిష్కరణ చేశారు. దీంతో ఆ కుటుబాలకు చెందిన వారు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక తమపై దాడి చేసి గ్రామ బహిష్కరణ చేశారని, గ్రామంలో అడుగుపెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. బెదిరింపులు తాళలేక ఇతర గ్రామాల్లో తలదాచుకుంటున్నామని తెలిపారు. తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాదుల వాదనతో కోర్టు ఏకీభవించింది. బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలని, గ్రామంలో ప్రశాంత జీవనం కల్పించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ల తరపున న్యాయవాదులు నర్రా శ్రీనివాస్, ముప్పాల బాలకృష్ణ వాదనలు వినిపించారు.
Tags :