హైదరాబాదీ బాలికకు రూ.2.7 కోట్ల స్కాలర్షిప్
అమెరికాలోని ప్రముఖ వెల్లస్లీ కాలేజీలో హైదరాబాదీ బాలిక భారీ స్కాలర్షిప్తో సీటు సంపాదించారు. మల్కాజిగిరికి చెందిన శ్రీయా లక్కాప్రగడ పదోతరగతి వరకు సైనిక్పురిలోని భారతీయ విద్యాభవన్లో, డెల్టా కాలేజ్లో ఇంటర్ చదివారు. అనంతరం డెక్స్టెరిటీ గ్లోబల్ మార్గదర్శకత్వంలో అమెరికాలో ప్రముఖ కాలేజీల్లో సీటు కోసం దరఖాస్తు చేశారు. పలు అంశాల్లో ప్రతిభ చూపిన శ్రీయ వెల్లస్లీ కాలేజీలో రూ.2.70 కోట్ల స్కాలర్షిప్నకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శ్రీయ మాట్లాడుతూ వెల్లస్లీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ లేదా సైకాలజీలో డిగ్రీ చదివే అవకాశాలున్నాయని, ఆ తర్వాత మాస్టర్స్ కూడా అమెరికాలో పూర్తి చేస్తానని తెలిపారు. ఎంఎస్ పూర్తయ్యా, స్టార్టప్ను ప్రారంభిస్తానన్నారు.
Tags :