ASBL NSL Infratech

టీటీడీ కీలక నిర్ణయం

టీటీడీ కీలక నిర్ణయం

న్యూ ఇయర్‌ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్‌ 31తో పాటు జనవరి 1న శ్రీవేంకటేశ్వరస్వామికి ఆర్జిత సేవుల, ప్రత్యేక దర్శనాలను రద్దుచేస్తున్నట్లు తెలిపింది. నూతన సంవత్సరం నేపథ్యంలో భక్తులు స్వామివారి దర్శనానికి భారీగా పొటేత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో టీటీడీ ఈ మేరకు స్పందించింది. అలాగే ఆదివారం అర్థరాత్రి నుంచి కాలినడకన వచ్చే భక్తులకు దివ్యదర్శనం టొకెన్లను, వృద్ధులు, దివ్యాంగులు, దాతలకు ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేస్తున్నామని టీటీడీ వెల్లడించింది. రద్దీ నేపథ్యంలో జనవరి 6 వరకు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తేల్చిచెప్పింది. ప్రొటోకాల్‌ ను కేవలం ప్రముఖులకే వర్తింపజేస్తామని పేర్కొంది. 2019, జనవరి 2 నుంచి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు కొనసాగుతాయని సృష్టం చేసింది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :