ASBL NSL Infratech

పరిపాలన అంటే టిక్‌టాక్‌లు కాదు

పరిపాలన అంటే టిక్‌టాక్‌లు కాదు

రాజధాని రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకురాలు పంచుమర్తి అనురాధ సృష్టం చేశారు. రైతులు ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాజధాని రైతుల దుస్థితి చూసి చలించి టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తన చేతి గాజులు ఇచ్చారన్నారు. రైతుల దీక్షకు మద్దతిచ్చిన భువనేశ్వరిపై విమర్శలు చేస్తున్నారన్నారు. పరిపాలన అంటే టిక్‌టాక్‌లు కాదని పుష్పశ్రీవాణి తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. తమ సమస్యలు చెప్పేందుకు పుష్పశ్రీవాణి అందుబాటులోని రారని అనురాధ విమర్శించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :