ASBL NSL Infratech

ఉక్కు మొక్కు తీర్చుకున్న సీఎం రమేశ్

ఉక్కు మొక్కు తీర్చుకున్న సీఎం రమేశ్

కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన జరగడంతో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ తిరుమల వచ్చి మొక్కు తీర్చుకున్నారు. ఆదివారం రాత్రి కుటుంబసభ్యులతో సహా శ్రీవారి మెట్ల మార్గంలో ఆయన కాలినడకన తిరుమల చేరుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారిని దర్శించుకున్నారు. తన చిరకాల కోరిక నేరవేరడంతో తలనీలాలను సమర్పించానని తెలిపారు. కేంద్రప్రభుత్వం చేయాల్సిన పనిని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంగతిని పార్లమెంటులో ప్రస్తావిస్తానని తెలిపారు. సొంత జిల్లాలో పరిశ్రమ నిర్మించేందుకు కృషి చేయాల్సిందిపోయి ప్రతిపక్ష నాయకుడు విమర్శలు చేయడం సరికాదన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :