ASBL NSL Infratech

బీజేపీలోకి మోత్కుపల్లి

బీజేపీలోకి మోత్కుపల్లి

బీజేపీలోకి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు చేరడం దాదాపుగా ఖాయమైంది. ఇందుకోసం ఆయన ముహూర్తాన్ని కూడా రెడీ చేసుకున్నారు. ఈ నెల 7న బీజేపీలో మోత్కుపల్లి చేరనున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కషాయ కండువా కప్పుకోనున్నారు. మోత్కుపల్లితో పాటు పలువురు ముఖ్యనేతలను బీజేపీలో చేర్చే పనిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఉన్నారు. ఇటీవల లక్ష్మణ్‌, మోత్కుపల్లి ఇంటికి వెళ్లి బీజేపీలోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. దీంతో మోత్కుపల్లి నర్సింహులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. బీజేపీలో మోత్కుపల్లి చేరితే తెలంగాణలో తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందని కమలం నేతలు భావిస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :