ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈడీబీకి స్కోచ్ గోల్డ్ అవార్డు
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వం అవార్డుల తత్వం
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈడీబీకి స్కోచ్ గోల్డ్ అవార్డు
సీఈవోకు సీఎం అభినందన
పెట్టుబడులను ఆకర్షించడంలోనూ, పారిశ్రామిక సంస్థలు కార్యకలాపాలు సాగించేలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని జాతీయ స్థాయిలో అవలంబిస్తున్నందుకుగాను ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి (ఏపీఈడీబీ) స్కోచ్ గోల్డ్ అవార్డును దక్కించుకుంది. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో జరిగిన స్కోచ్ ఇంటర్నేషనల్ 55వ సమ్మిట్లో ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణ కిశోర్ అవార్డు అందుకున్నారు. శనివారం ఉండవల్లిలోని ప్రజావేదిక ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఈ అవార్డును చూపించారు. ఈడీబీ సేవలు, విదేశీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చేస్తున్న కృషి, ఆసక్తిగల సంస్థలకు అందిస్తున్న సహకారం, పెట్టుడుల ప్రోత్సాహం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డును అందజేసిందని సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా కృష్ణకిశోర్ బృందాన్ని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.