Radha Spaces ASBL

3 ఐలతో దూసుకెళుతున్న తెలంగాణ.... రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు

3 ఐలతో దూసుకెళుతున్న తెలంగాణ....  రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు

తెలంగాణలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు  త్రీ ఐః మంత్రం నడుస్తోందని, ఈ మూడిరటినీ దేశవ్యాప్తంగా అమలు చేస్తే కచ్చితంగా నయా భారత్‌ను కొత్త తరానికి అందించొచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. 75ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన సమావేశంలోనూ ఇదే విషయం చెప్పానని గురు ్తచేశారు. త్రీ ఐ అంటే ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్‌క్లూ సివ్‌ గ్రోత్‌ అని వివరించారు.

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన టిఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశంలో ‘పరిపాలన సంస్కరణలు, విద్యుత్‌ రంగాభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, ఐటి రంగం అభివృద్ధి.. మౌలిక వసతుల కల్పన’ తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అమలు చేస్తున్న కార్యక్రమాలు ముఖ్యమంత్రి కెసిఆర్‌ నాయకత్వంలో ‘త్రీ ఐ’ తో నడుస్తుందన్నారు. సమగ్ర కుటుంబసర్వే దేశ చరిత్రలోనే సంచలనం అన్నారు.సమగ్ర కుటుంబ సర్వేతో సంక్షేమాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లగలిగామన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూ సర్వే నిర్వహించి.. అక్షాంశాలు, రేఖాంశాలతో భూములను గుర్తించి పాసు పుస్తకాలు జారీ చేస్తామన్నారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌తో నిరంతర సంపద సృష్టి జరుగుతోంది.

గూగుల్‌కు గుండెకాయ.. అమెజాన్‌, యాపిల్‌కు ఆయువుపట్టు హైదరాబాద్‌. ఫేస్‌బుక్‌ ఫస్ట్‌ ఫేవరేట్‌ డెస్టినేషన్‌ హైదరాబాద్‌. ఐటీ అంటే ఇన్‌క్రెడిబుల్‌ తెలంగాణ. దేశంలోనే అతిగొప్ప స్టార్టప్‌గా రాష్ట్రం అవతరించిందన్నారు. బెంగాల్‌ ఆలోచించేది దేశం మొత్తం ఆలోచిస్తుందనేది ఒకప్పటి మాట. ఇప్పుడు తెలంగాణ ఆలోచించేదే దేశం ఆలోచిస్తోందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు రావన్నారు. ఉన్న పెట్టుబడులు పోతాయని వెక్కిరించారు. టీఎస్‌ ఐపాస్‌తో తెలంగాణకు కంపెనీలు బారులు తీరుతున్నాయి. ఒకప్పుడు విమర్శించిన వాళ్లే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. తయారీ పరిశ్రమలో తెలంగాణకు ఎదురులేదు. ఫార్మా రంగంలో అగ్రస్థానంలో ఉన్నాం. టీకాల ఉత్పత్తిలో ప్రపంచానికి రాజధానిగా మారాం. నాడు ఆగమైన తెలంగాణ నేడు దేశానికే ఆదర్శమైంది. ఉపాధి అవకాశాలకు తెలంగాణ అక్షయపాత్ర అయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీకి హైదరాబాద్‌ బ్యాకప్‌ మాత్రమే. ఇవాళ ఐటీకి హైదరాబాద్‌ బ్యాక్‌ జోన్‌ అయింది’’ అన్నారు. 

 టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఏడేళ్ల పాలన తెలంగాణలో సంస్కరణలకు స్వర్ణ యుగమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఏడున్న రేళ్ల ప్రస్థానంలో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పాలన స్వర్ణ యుగాన్ని తెచ్చింది. ధరణి ఒక సంచలనమని, దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన సంస్క రణలు ఇతర రాష్ట్రాలకే కాదు.. దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయన్నారు.  కట్టుకథలకు పెట్టుబడులు రావని గత ప్రభు త్వాలకు హితవు చెప్పారు. పరిశ్రమలంటే టాటా, బిర్లాలు కాదు. కులవృత్తులు కూడా కుటీర పరిశ్రమలేనని స్పష్టం చేశారు.  టీఎస్‌ బీపాస్‌తో తెలంగాణకు కంపెనీలు క్యూ కట్టాయన్నారు. తయారీ రంగ పరిశ్రమలో తె లంగాణకు ఎదురులేదని, ఫార్మా రంగంలో అగ్రస్థానంలో ఉన్నట్లు చెప్పారు. టీకాల ఉత్పత్తిలో ప్రపం చానికి రాజధానిగా మారామని తెలిపారు. ఉపాధి అవకాశాలకు తెలంగాణ అక్షయపాత్రగా మారిందన్నారు.

కొత్త రాష్ట్రాన్ని సాధించడంతోపాటు అధికార వికేంద్రీ కరణ ఫలాలు ప్రజలకు అందాలనే సంకల్పంతో సరికొత్తగా పది జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా విభజించామ న్నారు. కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేశా మన్నారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టంతో పల్లె ప్రగతి కార్యక్రమంలో నిధులు, విధులతో ప్రతి పల్లె ఆదర్శ పల్లెగా కేంద్ర ప్రభుత్వం స్వయంగా గుర్తించి అవార్డులు ఇస్తోందని చెప్పారు. శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటేనే రాష్ట్రం సురక్షితంగా ఉంటుందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. పోలీసు కమిష నరేట్లను తొమ్మిదికి పెంచామన్నారు. దేశంలోనే లా అండ్‌ ఆర్డర్‌లో తెలంగాణ ఫస్ట్‌ ఇన్‌ సేఫ్టీ%ౌౌ% బెస్ట్‌ ఇన్‌ సెక్యూ రిటీ అనే విధంగా పేరు తెచ్చుకుందన్నారు. ధరణి పోర్టల్‌తో భూ రికార్డుల ప్రక్షాళన మొద లు పెట్టిందన్నారు. త్వర లోనే సమగ్ర భూ సర్వే నిర్వహిస్తామన్నారు.

గడిచిన ఏడేళ్లలో సీఎం కేసీఆర్‌ పాలనలో ఎన్నో రకాల పరిపాలనా సంస్కరణలు తెలం గాణలో ఆవిష్కృతమ ృయ్యాయన్నారు. పాల కుల, అధికారుల చేతిలో దశాబ్దాలుగా బందీ అయిన అధి కారాన్ని ప్రజల చేతికి అందించామని, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు నిరాటంకంగా పేదలకు అందుతున్నా యన్నారు. వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని కూకటి వేళ్లతో పెకలించామన్నారు. ఈ ఆశయ సాధన దిశగా సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణలో ఎన్నో సంస్కరణలతో కూడిన సువర్ణ అధ్యాయాలు నమోదవుతున్నాయన్నారు. అందులో మొదటిది సమగ్ర కుటుంబ సర్వే అని తెలిపారు. పరి పాలనా సంస్కరణలకు ప్రాణాధారం సరైన సమాచారం అని ప్రజలకు చెందిన సమాచారాన్ని ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తెలుసుకుందన్నారు. అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే సమగ్ర కుటుంబ సర్వే యజ్ఞా నానికి శ్రీకారం చుట్టామన్నారు. ఒక్క రోజులోనే దేశం అబ్బురపడేలా తెలంగాణ ప్రజల బతుకు చిత్రాలను గణం కాలతో సహా సేకరించి సంచలనం సృష్టించినట్లు వివరించారు.

తెలంగాణ స్టార్టప్‌..

టీఎస్‌ బీపాస్‌ ద్వారా తెలంగాణకు పరి శ్రమలు, పెట్టుబడులు తరలివస్తున్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కొత్త స్టార్టప్‌లు, పరిశ్రమల ఏర్పాటుతో తెలంగాణ స్టార్టప్‌ అంటుంటే కేంద్ర ప్రభుత్వం ప్యాకప్‌ అంటోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెగనమ్ముతోందని, ప్రయివేటుపరం చేస్తోందని దుయ్యబట్టారు.

 

Tags :