ASBL NSL Infratech

ఎలాన్ మస్క్ మరో కీలక ప్రకటన

ఎలాన్ మస్క్ మరో కీలక ప్రకటన

మెటా సీఈవో జుకర్‌బర్గ్‌తో కేజ్‌ ఫైట్‌ను మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వేదికగా లైవ్‌ స్ట్రీమింగ్‌ ఇస్తామని ట్విట్టర్‌ ఎక్స్‌ యజమాని ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. తద్వారా వచ్చే ఆదాయాన్ని వృద్ధాశ్రమాలకు విరాళంగా అందజేస్తామన్నారు. ఇదే విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. ప్రపంచ కుబేరుడు టెస్లా, స్పేస్‌ ఎక్స్‌, ట్విట్టర్‌ కంపెనీల బాస్‌ ఎలాన్‌ మస్క్‌, ఫేస్‌బుక్‌, మెటా ఫౌండర్‌ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ మధ్య పోరు జరుగుతుందని ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు దీనిపై మస్క్‌ మరో కీలక ప్రకటన చేయడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పుడు మళ్లీ వీరి రియల్‌ ఫైట్‌ గురించి నెట్టింట చర్చ నడుస్తోంది. ఎలాన్‌ మస్క్‌ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. స్పెస్‌ ఎక్స్‌, టెస్లా, ట్విట్టర్‌ సంస్థలకు బాస్‌. మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా సీఈవో, బాస్‌. ఇక వీరిద్దరూ వ్యాపారంలోనే కాదు నిజజీవితం లోనూ పోటీపడబోతున్నారు. ఇక ఈ ఇద్దరు కుబేరులు, వ్యాపారవేత్తల నడుమ కొంతకాలంగా పచ్చగడ్డి వస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :