ఎలక్షన్స్ తర్వాత జగన్ విదేశీ ప్రయాణం..
ఏపీ సీఎం జగన్ ఎన్నికల ముగిసిన తర్వాత విదేశీ ప్రయాణం కోసం అనుమతి ఇవ్వాల్సిందిగా హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాలకు వెళ్లడం కోసం ఆయన ఈ అనుమతి కోరుతున్నారు. అక్రమాస్తుల అభియోగాల నేపథ్యంలో జగన్ పై సీబీఐ లో పలు కేసులు నమోదై ఉన్నాయి. ప్రస్తుత జగన్ షరతులతో కూడిన బెయిల్ పై ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే అనుమతి లేకుండా దేశం విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు. ఈనెల 17 నుంచి జూన్ 1 మధ్యలో తన పిల్లల కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వవలసిందిగా బెయిల్ నిబంధనలు సడలించాలని సీబీఐ కోర్టును జగన్ కోరారు. నాంపల్లి సీబీఐ న్యాయస్థానం .. సీఎం జగన్ దాఖలు చేసిన పిటీషన్ కు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేయడం జరిగింది. ఎన్నికల ప్రచారం నిమిత్తం ఎంతో హడావిడి.. స్ట్రెస్ తీసుకున్న నేపథ్యంలో కాస్త కుటుంబంతో గడపడం కోసం.. జగన్ విదేశీ ప్రయాణం చేయబోతున్నారు.